వార్త‌లు

గత ప్రభుత్వం మోసం చేసింది – చుక్కా సాయిబాబు

పల్లె- పండగ అనే కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాల మేరకు తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఒకపక్క సంక్షేమం మరొకపక్క అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచనలతో 22 లక్షల వ్యయంతో డ్రైనేజీ శంకుస్థాపన,2.30 లక్షల వ్యయంతో మినీ గోకులం శంకుస్థాపన చేయడం జరిగింది అని, అలాగే మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మాజీ జడ్పిటిసి జిల్లా […]

వార్త‌లు

దమ్మెన్ను గ్రామంలో రీసర్వే గ్రామసభ

ఉండ్రాజవరం మండలం, దమ్మెన్ను గ్రామంలో సర్పంచ్ గురజర్ల సత్యనారాయణ అధ్యక్షతన శనివారం గ్రామసభ నిర్వహించబడింది. ఈ సమావేశంలో భూముల రీ సర్వేలో వచ్చిన సమస్యలకు సంబంధించి వినతులను స్వీకరించడం జరిగిందని తహసిల్దార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు సర్వే సందర్భంగా ఏర్పడిన సమస్యలను అధికారులకు తెలియజేశారు. ఈ సమావేశంలో మండల, గ్రామ రెవేన్యూ అధికారులు, సచివాలయ ఉద్యొగులు పాల్గొన్నారు.

వార్త‌లు

సి.పి.యం పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన ధరలపై రాస్తారోకో

పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం నాడు రేలంగి గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. సిపిఎం పార్టీ మండల పార్టీ కన్వీనర్ కామన మునిస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యవసర ధరలు పెరిగిపోవడం వల్ల ప్రజలంతా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని దీని వెంటనే ప్రభుత్వం అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే ఇసుక లేక బిల్డింగు కార్మికులు పనులు లేక పస్తులతో కాలం గడుపుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజల సమస్యలను

వార్త‌లు

కొత్తపల్లిలో సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన కందుల

నిడదవోలు నియోజకవర్గం, పెరవలి మండలం, కొత్తపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచే నిర్వహించబడిన పల్లె పండుగ-పంచాయితీ వారోత్సవాలు కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లను శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రెటరీ ఉల్స ఉలుసు సౌజన్య సత్య సాయి, ఉమ్మడి కూ టమి నాయకులు పాల్గొన్నారు.

వార్త‌లు

తణుకులో రోడ్ భద్రతా వారోత్సవాలు

తణుకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆటో డ్రైవర్లకు రోడ్డు రోడ్ సేఫ్టీ వారోత్సవాలలో భాగంగా శుక్రవారం తణుకు పట్టణ ప్రధాన మార్గంలో రోడ్ సేఫ్టీ యొక్క నిబంధనలు మరియు డ్రైవర్లు పాటించవలసిన నియమాలు గురించి హెల్మెట్ యొక్క ఆవశ్యకత మరియు ధరించకపోవడం చేత ప్రమాదాలు జరిగినప్పుడు కలిగే ఎక్కువ నష్టం గురించి సవివరముగా వారికి తెలియజేయడం జరిగిందని పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ఆటో డ్రైవర్లు సామాన్య ప్రజలు పాల్గొన్నారు.

వార్త‌లు

ఉండ్రాజవరం గ్రంథాలయం లో మహర్షి వాల్మీకి జయంతి

ఉండ్రాజవరం శాఖ గ్రంధాలయంలో గురువారం శ్రీ మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమంలో వాల్మీకి చిత్రపటానికి పుష్పమాల వేసి ఘనంగా నివాళులర్పించినారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆకెళ్ళ శ్రీనివాసరావులు మాట్లాడుతూ వాల్మీకి సాంస్కృతిక సాహిత్యంలో పేరు తెచ్చుకున్న వ్యక్తి అని వాల్మీకి రామాయణం వ్రాసి, సంస్కృతిక భాష ఆదికవిగా గుర్తిస్తారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి గుత్తికొండ కృష్ణారావు పాఠకులు ఏం.వి. కృష్ణారావు, వంగా చందర్రావు, పి.శ్రీను, టీ.వరప్రసాద్, కాయల వీర వెంకట

వార్త‌లు

తణుకు 29 వ వార్డులో గ్రామదర్శిని

తణుకు పట్టణంలోని 29వ వార్డులో గ్రామదర్శిని కార్యక్రమం లో పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి తణుకు పట్టణంలోని 29వ వార్డులో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి తణుకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రైవేట్ స్థలాలలో మొక్కలు ఎక్కువగా పెరిగిపోయి ఉన్నాయని మొక్కలన్ని తొలగించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా 29 వ వార్డులో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని వార్డులో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని అన్నారు.ముఖ్యంగా

వార్త‌లు

సదరన్ జోన్ జోనల్ కౌన్సిల్ సభ్యునిగా కందుల దుర్గేష్

సధరన్ జోన్ జోనల్ కౌన్సిల్ సభ్యులుగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ని నియమించిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ Congratulations Minister saab

వార్త‌లు

బిజెపి సభ్యత్వ నమోదు

దువ్వ గ్రామంలో రూరల్ మండలం బిజెపి అధ్యక్షులు దాసరి వెంకటస్వామి ఆధ్వర్యంలో జరిగిన బిజెపి సభ్యత్వ స్పెషల్ డ్రైవ్ లో 200 మంది బిజెపిసభ్యత్వం తీసుకున్నారని జిల్లా బిజెపి సభ్యత్వ ప్రముఖ్ మరియు జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి పాల్గొని నిన్నటికీ సభ్యత్ నమోదు రాష్ట్రంలోని రెండవ స్థానంలో ఉందని ఈ సభ్యత్ నమోదు ఈరోజుతో ముగుస్తుందని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రధాని మోడీ గారి తీసుకుంటున్న మంచి నిర్ణయాలకు ప్రజలు పెదఎత్తున

వార్త‌లు

మునుపెన్నడూ జరగని విధంగా కూటమి ప్రభుత్వంలో గ్రామాలలోఅభివృద్ధి –

మునుపెన్నడూ జరగని విధంగా కూటమి ప్రభుత్వంలో గ్రామాలలోఅభివృద్ధి – తణుకు ఎం‌ఎల్‌ఏ ఆరిమిల్లి* గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా మంగళవారం తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఇరగవరం మండలం కె.కుముదవల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సంధర్భంగా గ్రామంలో ప్రతి గడపకు వెళ్ళి ప్రజల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గ్రామంలో డ్రైనేజి, రోడ్ల సమస్యలు ఉందని గ్రామస్తులు ఎం‌ఎల్‌ఏ రాధాకృష్ణకి తెలిపారు. వాటి పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు తెలియజేసి రానున్నరోజుల్లో వాటిపై చర్యలు చేపట్టడం జరుగుతుందని

Scroll to Top