వార్త‌లు

కేసుల రాజీకి ఏకైక రాజమార్గం జాతీయ లోక్ అదాలత్

4వ అదనపు జిల్లా కోర్టు తణుకు. రాష్ట్ర న్యాయ సేవల సంస్థ గుంటూరు వారి ఉత్తర్వుల మేరకు చైర్మన్ మరియు జిల్లా జడ్జి ఏలూరు వారి ఆదేశముల మేరకు చైర్మన్ మరియు 4వ అదనపు జిల్లా జడ్జి డి. సత్యవతి ఒక పత్రికా ప్రకటనలో ఈ విదంగా తెలిపారు. ఉమ్మడి జిల్లాలలో కోర్టులు ఉన్న ప్రతిచోటా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. దానిలో రాజీపడు క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంక్ బకాయి కేసులు, ఎం.వి.ఓపి. […]

వార్త‌లు

బాలుర ఉన్నత పాఠశాలలో పోలీసు అవగాహన కార్యక్రమం

సమాజాన్ని, పాఠశాలను, కుటుంబాన్ని గౌరవించాలి. తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు ప్రత్యేక పోలీసు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే.పద్మావతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తణుకు టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ కే. శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడిరి. విద్యార్థులు, తల్లిదండ్రులను, పాఠశాల టీచర్లను గౌరవిస్తూ సమాజంలో మంచి సత్ప్రవర్తనను కలిగి ఉండాలని కోరారు. విద్యార్థులలో క్రమశిక్షణాలోపం, హెయిర్ స్టైల్స్, చెడు అలవాట్లుకు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకోవద్దు

వార్త‌లు

ప్రజల సమస్యలు పరిష్కారానికి సత్వర సమస్యల నుంచి విముక్తి చేసేందుకు గ్రామదర్శిని

తణుకు నియోజకవర్గం తణుకు మండలం కోనాల గ్రామంలో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో తణుకు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజల సమస్యలు పరిష్కారానికి సత్వర చర్యలు, సమస్యల నుంచి విముక్తి చేసేందుకు గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ గ్రామంలో 2100, మంది జనాభా కలిగి ఉన్నారని ఈ గ్రామ ప్రధాన సమస్యలు డ్రైన్లు, రోడ్లు అద్వానంగా ఉన్నాయని అన్నారు. ఈ గ్రామంలో

వార్త‌లు

ప్రజలకు ధరలు అందుబాటులో ఉంచడానికే – ఆరిమిల్లి

తణుకు పట్టణంలో బాలగంగాధర్ తిలక్ ఆడిటోరియం వద్ద పెరుగుతున్న నిత్యవసరాల ధరలను నియంత్రించి ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ నిత్యవసర వస్తువులు, కూరగాయల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించినారు, ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. తణుకు బాలగంగాధర్ తిలక్ ఆడిటోరియం వద్ద తక్కువ ధరలకే నిత్యవసర వస్తువుల

వార్త‌లు

నీ నోటిని ఫినాయిల్ తో కడుగుకుంటేనే నీ పాపాలు పొతాయి మాజీ మంత్రి

తణుకు నియోజకవర్గంలో శాసనసభ్యుల కార్యాలయం నందు బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించినారు, ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుందని అన్నారు. దేశ విదేశాల నుండి పెట్టుబడులు ఈరోజు రాష్ట్రంలో క్యూ కడుతున్నాయి. మరో ప్రక్క సంక్షేమ పథకాలు హామీలు కూడా ఎన్నికలలో ఇచ్చిన హామీలు మేరకు ఒక ప్రణాళిక ద్వారా అమలు చేయడం జరుగుతుందని అన్నారు. గత

వార్త‌లు

తణుకు మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్యంపై సమీక్షా సమావేశం

తణుకు పట్టణ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు, శానిటరీ, సచివాలయం సెక్రటరీలతో బుధవారం ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్ లో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా పట్టణంలో పారిశుధ్య పనుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కాలంలో కురుస్తున్న వర్షాలకు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలు డెంగ్యూ, మలేరియా లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా తీసుకోవలసిన ప్రత్యేక జాగ్రత్తలు గురించి వివరించారు. అనంతరం మున్సిపల్ సిబ్బందికి ఎం‌ఎల్‌ఏ ఆరిమిల్లి రాధాకృష్ణ

వార్త‌లు

గతపాలకులు తణుకు పట్టణ అభివృద్దిని నిర్లక్ష్యం చేసారు

తణుకు నియోజకవర్గంలో తణుకు పట్టణంలో స్థానిక 22వ వార్డులో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో తణుకు నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు, సమస్యల నుండి విముక్తి చేసేందుకు గ్రామదర్శిని కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ గడిచిన గత ఐదు సంవత్సరాలు కాలంలో తణుకు మున్సిపాలిటీ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని అన్నారు. 22 వార్డు పర్యటనలో పాల్గొని స్థానికులు సమస్యలన్నీ అడిగి తెలుసుకున్నారు. గత

వార్త‌లు

పొలీసు అమరవీరుల సంస్మరణదినం అక్టొబర్ 21

విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీసు అమరవీరుల సంస్మరణార్థం నిర్వహించుకుని, భావితరాలకు వారి త్యాగాలను తెలియజెప్పడమే అమరవీరుల సంస్మరణ దిన ఉద్దేశమని పోలీసు అధికారుల తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం అక్టోబర్ 21వ తేదీ సోమవారం తణుకు పట్టణ, రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగ ఫలాలను వివరిస్తూ పట్టణంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి నరేంద్ర సెంటర్ యందు అమరవీరుల స్థూపము వద్ద పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ

వార్త‌లు

అమరవీరుల త్యాగాలే – నేటి తరాలకు ఆదర్శాలు – ఏస్సై జానా సతీష్

కర్తవ్య నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరులకు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21వ తేది సోమవారం ఇరగవరం ఎస్ఐ జానా సతీష్, స్టేషన్ సిబ్బంది, మండలంలోని గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పోలీస్ అమరవీరుల సంస్మరణగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను మరువరాదని, వారి స్ఫూర్తితో కర్తవ్యం నిర్వహణలో పాల్గొనాలని, వారు చేసిన త్యాగాల ఫలితమే నేటి మన ప్రశాంత జీవనం అని ఎస్సై

వార్త‌లు

అమరవీరుల త్యాగాలను మరువలేము- ఎస్.ఐ. జి.శ్రీనివాసరావు

విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరులకు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21వ తేది సోమవారం ఉండ్రాజవరం ఎస్ఐ జి.శ్రీనివాసరావు, స్టేషన్ సిబ్బంది, మండలంలోని గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు, ఎం.వి.ఎన్.జడ్.పి.హైస్కూల్ ప్రధానోపాద్యాయులు మాణిక్యాలరావు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పోలీస్ అమరవీరుల సంస్మరణగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను మరువరాదని, వారి స్ఫూర్తితో కర్తవ్యం నిర్వహణలో పాల్గొనాలని ఎస్సై జి శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా బాల బాలికలతో

Scroll to Top